Monday, April 29, 2024

కుక్కపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు…ఎక్కడంటే…

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఓ వ్యక్తి కుక్కపై కేసు పెట్టడానికి పోలీస్ లను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన ధారవత్ పూల్య నాయక్ తనను ప్రతిసారి గూడూరు మండలంలో వ్యవసాయ శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ కుక్క కరవడం జరుగుతుందనీ.. ఈ కుక్కను పెంచుకున్న వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని గూడూరు పోలీస్ లను ఆశ్రయించాడు. తన ఫిర్యాదును చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చేసేదేమీలేక కుక్కను పెంచుతున్న వ్యక్తిని పిలిచి పోలీస్ వారు మందలించి.. దారవత్ పూల్య నాయక్ కు చికిత్స చేసి బాగు చేసే బాధ్యతను అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement