Tuesday, April 30, 2024

జాతీయ జెండాను ఆవిష్కరించిన క‌లెక్ట‌ర్ శ‌శాంక‌

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక జాతీయ పతాకావిష్కరణ గావించారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా అధికారులు, ఏఓ. వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎందరో వీరులు అలుపెరుగని పోరాటం చేస్తేనే నేటి మన స్వాతంత్ర్యం సిద్ధించిందని, మనం పీల్చుకుంటున్న స్వేచ్ఛా వాయువులు ఎందరో వీరులు వదిలిన తుది శ్వాసల ఫలితమే అన్నారు. మాన్యుల నుండి సామాన్యుల వరకు ఏక దీక్షతో సాగించిన ఉద్యమ కారణంగానే పరాయి పాలన అంతమైందని, దేశభక్తుల త్యాగం చిరస్మరనీయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement