Saturday, May 4, 2024

పేదల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ వరం : ఎమ్మెల్యే అరూరి

వ‌రంగ‌ల్ : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కును) వరంగల్ జిల్లా తెరాస అధ్యక్షులు,వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఐనవోలు మండలం కొండపర్తి గ్రామానికి చెందిన బోయినపల్లి వెంకటేష్ తండ్రి సుధాకర్ రావుకు మంజూరు అయిన 2లక్ష రూపాయల చెక్కును లబ్ధిదారునికి అందజేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. మధ్య తరగతి కుటుంబంలో ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఆర్థికంగా చితికిపోయి కోలుకోలేని స్థితిలో ఉన్న కుటుంబాన్ని కొంతైన ఆదుకోవాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆర్థిక సహకారం అందించడం జరుగుతుందని, పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.పాల్గొన్న వారిలో దర్గా సొసైటీ చైర్మన్ ఊకంటి వనం రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు పోలేపల్లి శంకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి బుర్ర రాజశేఖర్,సర్పంచ్ కట్కూరి రాజమణి బెన్సన్,తెరాస కార్యకర్త మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement