వరంగల్: గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలలో తలలు నరికే టిఆర్ ఎస్ పార్టీ కావాలో , అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడే బిజెపి కావాలో ఓటర్లే తేల్చుకోవాలని అన్నారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. గ్రేటర్ ఎన్నికలలో భాగంగా ఆయన మడికొండ,హన్మకొండ ప్రాంతాలలో రోడ్ షోలు, కూడళ్లలో ప్రచారాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా టిఆర్ ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో రౌడీలకు, గుండాలకు టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందంటూ ఆరోపించారు.. ‘‘తలలు నరికే పార్టీ కావాల్నా.. ఓరుగల్లును అభివృద్ధి చేసే పార్టీ కావాలా ప్రజలు ఓటేసేప్పుడు ఆలోచించుకోవాలి’’ అని అన్నారు. రాంపుర్ డంప్ యార్డ్ నుండి చెత్త చెదారం వచ్చి వడ్డేపల్లి చెరువులో చేరుతున్నాయని తెలిపారు. ఆ నీటిని తాగునీటికి సరఫరా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి తమ అభ్యర్దులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement