Monday, April 29, 2024

గుడుంబా స్థావరాలపై దాడులు..

నల్లబెల్లి : నర్సంపేట ప్రోహిబిషన్ & ఎక్సైజ్, నల్లబెల్లి పోలీలు కలిసి మంగళవారం ఉదయం సంయుక్తంగా ముడుచేక్కల పల్లి, లైన్ తండా, రుద్రగూడెం గోవిందాపురం గ్రామాలలో నాటుసారా స్థావ‌రాల‌పై దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా అక్రమంగా నాటుసారా రవాణా చేస్తున్న భూక్యా నరేష్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద లభించిన 30 లీటర్ల నాటుసారాను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా నాటుసారా తయారు చేస్తున్న అంగోతు నీలా, వెంకన్న, భూక్యా రాజులపై కేసు నమోదు చేసి వారి వద్ద లభించిన 10 లీటర్ల నాటు సారాను, 5 కిలోల పటికను స్వాధీనం చేసుకొని, 100లీటర్ ల బెల్లం పానకాన్ని ధ్వసం చేశారు. ఈ దాడుల్లో రాజేశ్వరి P&ESI నర్సంపేట, నల్లబెల్లి SI రాజారామ్, hcలు సదానందం, లింగేశ్వర్, PCలు రామూర్తి, స్వర్ణ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement