Monday, May 6, 2024

అగ్నిప‌థ్ ఆందోళన : హ‌న్మ‌కొండ బీజేపీ ఆఫీస్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌.. కాంగ్రెస్‌, బీజేపీ వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

హనుమకొండలోని బీజేపీ జిల్లా ఆఫీసు దగ్గర కాంగ్రెస్ శ్రేణుల ధర్నాతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఇవ్వాల (శుక్ర‌వారం) ధర్నా చేపట్టారు. దీనికి స్పంద‌న‌గా బీజేపీ శ్రేణులు.. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో రెండు పార్టీల‌ మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈ క్ర‌మంలో ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ వాహనాలపై దాడి చేశారు.

ఇరువర్గాల మ‌ధ్య జ‌రిగిన‌ పరస్పర దాడులతో హనుమకొండ బీజేపీ ఆఫీసు ద‌గ్గ‌ర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడిలో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ కార్యాలయం వద్దకు వచ్చి నిరసన చేప‌డ్డ‌డంపై బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement