Wednesday, April 24, 2024

Breaking: ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. పోలీసు కాల్పుల్లో మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలోని గదిరాస్ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ)కి, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు చనిపోయాడు. మృతిచెందిన మావోయిస్టును కమలేష్‌గా గుర్తించారు. మన్కపాల్‌లోని బోరపర అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కమలేష్ మలంగిర్ ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. తాజాగా అతడిపై రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించిన బస్తర్ ఐజి పి.సుందర్‌రాజ్ ఆ ప్రాంతంలో ఇంకా సెర్చింగ్​ కొనసాగుతున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement