Monday, April 29, 2024

Warangal | బస్ ఢీ కొని వ్యక్తి మృతి.. న‌ర్సంపేట‌లో ఘ‌ట‌న‌

వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఆర్టీసి బస్సు ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన జరిగింది. నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిలో ఉన్న బిట్స్ కళాశాల వద్ద రోడ్డు పై వెళ్తున్న వ్యక్తిని బస్ బలంగా ఢీ కొట్టడంతో అధిక రక్త స్రావం కావడంతో స్థానిక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement