Monday, April 29, 2024

Flash: ప్రాణం తీసిన ఈత సరదా

సరదాగా తోటి మిత్రులతో ఈతకు వెళ్లిన బాలుడు లోతైన గుంతలో నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరరం గ్రామపంచాయతీ పరిధిలోని బాల్యతాండలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాల్య తండాకు చెందిన బాణోత్ లకపతి, సుజాత దంపతుల కుమారుడు బాణోత్ రేవంత్(7) 2వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు రావటంతో శనివారం సరదాగా తోటి మిత్రులతో కలిసి స్థానిక చెరువులో ఈతకు వెళ్ళాడు. చేరువులో గుంత లోతు అంచనా లేని రేవంత్.. అందరి కంటే ముందు దూకాడు. అదే క్రమంలో లోపల రేగడిలో కూరుకొని పైకి రాలేదు. ఎంత సేపటికి రేవంత్ పైకి రాకపోవటంతో తోటి మిత్రులు తండా వాసులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకొని చూసేసరికి రేవంత్ విగత జీవిగా నీటిలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement