Tuesday, May 7, 2024

Warangal : తెలంగాణ అమరవీరులకు.. పోలీసుల ఘన నివాళులు

అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించ్చారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనరేట్ కార్యాలయం భవన ప్రాంగాణములో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల చిత్ర పటం ముందు వరంగల్ ఏ. వి. రంగనాథ్ పుష్పలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అధికారులు, సిబ్బంది రెండు నిముషాలు మౌనం పాటించి తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు..అమరవీరులకు నివాళులు అర్పించిన వారిలో డీసీపీ లు మురళీధర్, కరుణాకర్, అబ్దుల్ బారి, అదనపు డీసీపీలు సంజీవ్, సురేష్ కుమార్, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, తిరుమల్, శ్రీనివాస్, ఆర్. ఐ లు నగేష్, భాస్కర్, చంద్రశేఖర్ తో పాటు ఈ ఇన్స్ స్పెక్టర్లు, ఎస్. ఐలు, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది, పోలీస్ అధికారులు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement