Thursday, April 18, 2024

కాలనీల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటాన‌న్న‌ వివేకానంద గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131వ‌ డివిజన్ పరిధిలోని వాణి నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను తన నివాసం వద్ద సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

సంక్షేమ సంఘం సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ ఎటువంటి సమస్యలున్నా… తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ నూతన సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ జి.సూర్య నారాయణ, జార్జ్, రాజేంద్ర ప్రసాద్, సత్యవతి, బాలరాజు, సత్యనారాయణ, కరిముల్ల, రమేష్, శివరామ కృష్ణ, బస్వరాజు, నాగిరెడ్డి పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement