Sunday, April 28, 2024

TS : ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించిన వికారాబాద్ యువతి

వికారాబాద్, మార్చి 2 ( ప్రభ న్యూస్): గురుకుల బోర్డు నిర్వహించిన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఈ యువతి ఏకంగా నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రామయ్య గూడ కు చెందిన ఈ యువతి పేరు దుద్యాల పావని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించింది.

తల్లి చంద్రమ్మ ఓ మెడికల్ కాలేజీలో స్విపర్ గా పని చేస్తూ కష్టపడి చదివించింది. దానికి ఫలితంగా ఆహార్నిశలు శ్రమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. గురుకుల బోర్డు నిర్వహించిన ప్రభుత్వ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నే కాకుండా ఇంటర్వ్యూ, మరియు డెమో లో నెగ్గి వావ్ అనిపించింది. ఏకంగా నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించింది. డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రెయిండ్ గ్రాడ్యుయేట్ టీచర్‌గా అర్హత సాధించిది. ఎందుకు రామయ్యగూడవాసులు పావనిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement