Monday, April 29, 2024

వీహెచ్ కు ఉపరాష్ట్రపతి పరామర్శ

కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత్ రావుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి పరామర్శించారు. ప్రస్తుతం కిడ్నీ సమస్యతో అపోలో ఆసుపత్రిలో వీహెచ్ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెకుసుకున్నారు. వీహెచ్ త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యానాయుడు ఆకాంక్షించారు. తనను గుర్తు పెట్టుకొని పరామర్శించిన వెంకయ్య నాయుడుకు వీహెచ్ ధన్యవాదాలు తెలిపారు. మీ పరామర్శతో తనకు చాలా ఉత్సాహం వచ్చిందని చెప్పారు. త్వరలోనే ఆరోగ్యం నుంచి కోలుకొని.. డిశ్చార్జ్ అవుతానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement