Sunday, April 28, 2024

RR: తిమ్మాపూర్ లో వాహన తనిఖీలు.. రూ.5 లక్షల నగదు సీజ్

షాద్ నగర్, అక్టోబర్ 20 (ప్రభ న్యూస్) : కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ అండర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా గురువారం మధ్యాహ్నం హైదరాబాదు నుండి చెగూర్ వైపు వెళ్తున్న TS- 12-EN-7467 కారుని ఆపి తనిఖీలు చేశారు.

ఈ తనిఖీల్లో నవనీత్ అగర్వాల్ కు చెందిన రూ.5 లక్షల నగదుకు సంబంధించి సరైన ద్రువపత్రాలు చూపకపోవడంతో 5 లక్షల రూపాయలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ డబ్బులను డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీకి పంపడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement