Saturday, May 18, 2024

Big Breaking | వరాల చంద్రుడు.. మెదక్​ ప్రజలు కోరినవన్నీ ఇచ్చిన సీఎం కేసీఆర్​

బీఆర్​ఎస్​ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తొలిసారి మెదక్​ జిల్లాలో ప్రగతి శంఖారావం సభ జరిగింది. బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్​ ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం కేసీఆర్​ ప్రస్తావించారు. ఆయన మాటల్లోనే..

ఉమ్మడి మెదక్​ బ్యూరో (ప్రభ న్యూస్​): పోయిన ఎన్నికల్లో మెదక్​ వచ్చినప్పడు నేను ఒకటే మాట మీతో మనవి చేయడం జరగింది. పద్మ నా బిడ్డ, ఆమె అడిగితే నేను ఏదీ కూడా కాదనే పరిస్థితి ఉండదు. దాని ఫలితమే ఇంద్ర భవనం లాంటి కలెక్టరేట్​, ఎస్పీ ఆఫీసు ఇవ్వాల చూస్తున్నారు. ఉద్యమంలో నాతో పాటు కలిసి ఉండి.. ఇవ్వాల్టి వరకు మనతో కలిసి ఉన్న బిడ్డ పద్మక్క. ఇప్పుడే నన్ను ఆమె కోరింది. మెదక్​ పట్టణంలో రోడ్లు చిందరవందరగా అయ్యాయి. వాటిని బాగు చేసుకోవాలే.. పంచాయతీలకు కూడా నిధులు కావాలనే అడిగింది. రామాయంపేట రెవెన్యూ డివిజన్​ కావాలని అడిగింది. మీకు ఎల్లుండి సాయంత్రంలో లోగా శాంక్షన్​ చేసి జీవో కూడా పంపిస్తానని మాట ఇస్తున్నా.  

రామాయంపేటలో డిగ్రీ కాలేజీ కూడా కావాలని కోరారు. అది కూడా మంజూరు చేస్తున్నా. మెదక్​కు రింగ్​రోడ్డు కూడా మంజూరు చేస్తున్నా.. అదేవిధంగా, ఏడు పాయల టెంపుల్​ దుర్మగామాత దగ్గర గతంలో ప్రకటించినటువంటి టూరిజం ప్యాకేజీలో వంద కోట్ల రూపాయలు కావాలని అడిగారు.. దానికి కూడా మంజూరు ఇస్తున్నా.. కౌడిపల్లిలో కూడా డిగ్రీ కాలేజీ అడిగారు. దానికి కూడా మంజూరు చేస్తున్నా.. మెదక్​ జిల్లాలో ప్రతి పంచాయతీకి నిధులుమంజూరు చేస్తున్నా.. అదేవిధంగా.. నాలుగు మున్సిపాలిటీలకు నర్సాపూర్​, రామాయంపేట, తూప్రాన్​ కు తలా 25కోట్లు.. మెదక్​ మున్సిపాలిటీకి 50 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఈ ఫండ్స్​తో పనులన్నీ చేయాలని చెబుతున్నా.

ఇగ ఇప్పుడు మీ పని అయిపోయింది.. ఇగ నాపని ఉన్నది.. మిమ్మల్నందరినీ కోరేది ఒక్కటే.. ఎవరూ ఆగమాగం కావద్దు.. పంట కోతలయినంక గంగెడ్ల వారు వచ్చినట్టు వస్తుంటరు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక్క చాన్స్​ ఇవ్వాలని కాంగ్రెస్ వారు కోరుతున్నారు. ఇప్పటికే వారికి చాలా చాన్స్​లు ఇచ్చినం.. ఎవరూ గణపురం కాల్వలను బాగు చేయలే.. అప్పడు తుమ్మ చెట్ల మొలిచినయ్​.. మనం గణపురం కాల్వలు బాగుచేస్కున్నమ్​. 40లక్షల ఎకరాల దాకా నీరు అందుతోంది. మంచిగ పంటలు పండుతున్నయ్​.. గణపురం ఆయకట్టు కింద ఒక గుంట కూడా దెబ్బతినకుండా పంటలు పండిస్తున్నమ్​.

- Advertisement -

తెలంగాణ రాకముందు చెట్టుకొక్కరు గుట్టకొకరు అయ్యారు. అందరం బాధపడ్డాం. రైతులను బాగు చేయాలనే సంకల్పం తీసుకుని దానికి తగ్గట్టు పనులు చేసుకుంటూ వచ్చినం. రైతుబంధు, రైతు బీమాతో రైతులకు మేలు చేసినం. కాళేశ్వరం జలాలతో పంటపొలాలకు నీళ్లు పారుతున్నయ్​.

కేసీఆర్​ సీఎం కావడం వల్లే మెదక్​ జిల్లా సాధ్యమయ్యింది: మంత్రి హరీశ్​రావు

మెదక్​ జిల్లా కావాలనేది కొన్ని దశాబ్దాల కల.. ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీ మాట ఇచ్చారు. ఏండ్లు గడిచాయి కానీ జిల్లా కల నెరవేరలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్​ మాట ఇచ్చారు. అది కొన్ని రోజుల్లోనే నేరవేరింది. జిల్లా పోలీసు ఆఫీసు, కలెక్టరేట్​ భవన సముదాయం, మెడికల్​ కాలేజీ, రైలు అన్నీ మెదక్​కు వచ్చాయి. ఇవన్నీ కేసీఆర్​ సీఎం కావడం వల్ల మాత్రమే సాధ్యమయ్యాయని మంత్రి హరీశ్​రావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థులను పదికి పది మందిని గెలిపించి సీఎం కేసీఆర్​కు కానుకగా ఇద్దామన్నారు. మరోసారి సీఎం కేసీఆర్​ను ఆశీర్వదించాలని మంత్రి హరీశ్​ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement