Monday, May 13, 2024

Uttam Kumar Reddy – 50వేల మెజార్టీకి ఒక్క ఓటు త‌గ్గినా రాజీనామా చేస్తా…..

హుజూర్ న‌గ‌ర్ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు! వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్న తనకు 50వేల మెజార్టీ ఖాయమని, అంతకు ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగి, పార్టీని అధికారంలోకి తీసుకు వస్తామన్నారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement