Monday, April 29, 2024

TS : మేడారంకు కేంద్రమంత్రి…. ప్రత్యేక పూజల్లో పాల్గొననున్న కిషన్​రెడ్డి….

తెలంగాణ కుంభ‌మేళాకు భ‌క్తులు పోటేత్తుతున్నారు. ఈ క్ర‌మంలో అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకునేందుకు ప్ర‌ముఖులు మేడారం బాట‌ప‌ట్టారు. అందులో భాగంగా ఇవాళ కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి మేడారం వెళ్ల‌నున్నారు. అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకోనున్నారు.

ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి మేడారంకు చేరుకోనున్నారు. అక్క‌డి నుంచి మ‌ధ్యాహ్నాం అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ కార్య‌క్ర‌మానలు నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం మేడారం నుంచి సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్‌కు కిష‌న్‌రెడ్డి వెళ్ల‌నున్నారు. అక్క‌డ నిర్వ‌హించే బీజేపీ సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొన‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement