Sunday, April 28, 2024

AP : కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థినీలకు అస్వస్థత…

కడప ( పెండ్లిమర్రి), ప్రభ న్యూస్​: కడప యోగి వేమన యూనివర్సిటీలో కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పెరుగన్నం తిన్న విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులను కడప ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థినీలు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement