Monday, May 6, 2024

అండర్ డ్రైనేజీ పనులు వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి

భువనగిరి, (ప్రభన్యూస్) : భువనగిరి పట్టణ కేంద్రంలో నిర్మిస్తున్న అండర్ డ్రైనేజీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఈరోజు భువనగిరి పట్టణంలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో కలసి పర్యవేక్షించారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్ల‌ను కోరారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. అనంతరం రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది 3 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా నాయకులు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిని కలసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement