Tuesday, May 14, 2024

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం…. ఇద్దరు మృతి

రామచంద్రాపురం – సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహారాష్ట్రకు చెందిన రెండు టిప్పర్లు ఔటర్ పటాన్చెరు వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి గచ్చిబౌలి వైపు వెళ్తున్నాయి. టిప్పర్ లో సమస్య రావడంతో రోడ్డు పక్కకు రెండింటిని ఆపి రిపేర్ చేస్తున్నారు. వెనుక నుండి వేగంగా వచ్చిన కంటైనర్ ఈ టిప్పర్ ఢీకొట్టడంతో రిపేర్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

కంటైనర్ లోని డ్రైవర్ క్లీనర్కు గాయాలలో వారిని ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారాన్ని అందుకున్న కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ ఇన్స్పెక్టర్ సంజయ్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement