Friday, May 3, 2024

కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభకు చీఫ్ గెస్ట్ గా రండి… క‌ర్నాట‌క సిఎం సిద్దూకు భ‌ట్టి ఆహ్వానం

బెంగుళూరు – తెలంగాణ‌లో త్వ‌ర‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్న బీసీ డిక్లరేషన్ సభకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను సిఎల్పీ లీడ‌ర్ భ‌ట్టి విక్ర‌మార్క కోరారు.. ఈ మేర‌కు ఆయ‌న బెంగుళూరులోని సిఎం నివాసంలో సిద్ద‌రామ‌య్య‌ను క‌ల‌సి ఆహ్వానం అందించారు.. దీనిపై సిద్ద‌రామ‌య్య సానుకూలంగా స్పందిస్తూ బీసీ డిక్లరేషన్ సభపై ఎంతో ఆసక్తిని చూపారు. ఈ సభకు తప్పకుండా వస్తానని భ‌ట్టికి హామీ ఇచ్చారు.. కాగా, బీసీ డిక్లరేషన్ సభ ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామ‌ని, ఆ స‌మాచారాన్ని మీకు తెలియ‌జేస్తామ‌ని సిద్ద‌రామ‌య్య‌కు భట్టి చెప్పారు.

కర్నాట‌క సిఎంను క‌ల‌సిన వారిలో భట్టి విక్రమార్కతో పాటు ప్రచార కమిటీ ఛైర్మన్ మ‌ధుయాష్కి గౌడ్,, మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ హనుమంతరావు తదితరులు ఉన్నారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement