Friday, May 3, 2024

విద్యుత్ షాక్ తో ఎద్దులు మృతి

కరీంనగర్ జిల్లా – రామడుగు మండలం వెధిర గ్రామ పరిధిలో పంట పొలంలో వరి నాటు కోసం గొర్రు తోలుచుండగా విద్యుత్ షాక్ కు గురై రెండు ఎద్దుల మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నవి. గ్రామానికి చెందిన రైతు పన్యాల లచ్చిరెడ్డి పంట పొలంలో వరి నాటు వేసేందుకు రైతు శనిగరపు మల్లేశం గొర్రు తోలుచుండగా పొలం గట్టుపై ఉన్న విద్యుత్ స్తంభం( ఇనుప పోల్) కు అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో గొర్రు కట్టిన ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి

.కాగా విషయాన్ని గమనించిన రైతు లచ్చిరెడ్డి మల్లేశంకు విద్యుత్ సరఫరా అవుతుందని హెచ్చరించడంతో గట్టుపైకి వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది .కాగా ఎద్దుల విలువ దాదాపుగా లక్ష వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ట్రాన్స్కో అధికారులు పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement