Sunday, April 28, 2024

TS – అన‌కొండ కంటే పెద్ద కుంభ‌కోణం కాళేశ్వ‌రం – మంత్రి ఉత్త‌మ్

మేడిగ‌డ్డ – కాళేశ్వరం లాంటి కుంభకోణం ప్రపంచంలో మరొకటి ఉండదని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్​ ప్రారంభించిన ప్రాజెక్ట్ ను మార్చి కాళేశ్వ‌రం పేరుతో ల‌క్ష‌ల కోట్లు దండుకున్నార‌ని ఆరోపించారు.. కేసీఆర్​ చేసిన పనులు చూసి తుగ్లక్​ కూడా సిగ్గుపడుతారని అన్నారు. 14 టీఎంసీల నీటిని నిల్వ చేసి ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించారని మంత్రి అన్నారు. ప్రాజెక్ట్​ డ్యామేజ్​ పై కేసీఆర్​ ఇంతవరకు మాట్లాడలేదన్నారు.

నాలుగేళ్లుగా ప్రాజెక్ట్​ల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బ్యారేజ్​ లో కొన్ని నీళ్లు ఉంటేనే 18 వ పిల్లర్​ నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయన్నారు. నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ కూడా నిర్మాణంలో లోపం ఉందని నివేదిక ఇచ్చిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్​ విషయంలో గత ప్రభుత్వం చేసిన అక్రమాలను విచారణ జరిపిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ పనితీరులో వైఫల్యం చెందిందన్నారు. బాధ్యులంద‌రిపైనా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement