Friday, May 17, 2024

TS తప్పు చేశారు కాబట్టేే మోహం చాటేశారు ‍ ‍ ‍- ‍మంత్రి దుద్దిళ్ల

మేడిగడ్డ – గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని మండిపడ్డారుమంత్రి శ్రీధర్ బాబు. తప్పు జరిగింది కాబట్టే బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించినా మొహం చాటేశారని ఎద్దేవా చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే రాలేదని సెటైర్ వేశారు. అవినీతితో కట్టిన కాళేశ్వరం కాబట్టే కుప్పకూలిందని, దానితో పాటు కెసిఆర్ ప్రభుత్వం కూడా పోయిందని అన్నారు..

మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైల్‌లో ఎన్నో లోపాలు ఉన్నాయని అన్నారు. డిజైల్ లోపాల గురించి ఆనాడే తాను కేసీఆర్‌కు చెప్పానని గుర్తుచేశారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ ప్రధానమైనదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీలో నీరు నిలుస్తేనే ఎక్కడికైనా ఎత్తిపోసేది అని అన్నారు. కానీ, ప్రస్తుతం ఇక్కడ నీరు నిలిచే పరిస్థితి లేదని తెలిపారు. మిగతా జలాశయాలకు నీటిని ఎలా ఎత్తిపోస్తారు? అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement