Sunday, April 28, 2024

TS – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బిఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థిగా మ‌న్నె…

హైద‌రాబాద్ : లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో బీఆర్ఎస్ పార్టీ వేగం పెంచింది. నిన్న నాలుగు లోక్‌స‌భ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్.. తాజాగా మ‌రో అభ్య‌ర్థిని ఖ‌రారు చేశారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ అభ్య‌ర్థిగా మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి పేరును కేసీఆర్ ఫైన‌ల్ చేశారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్‌క‌ర్నూల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశ‌మై ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు.

2019 ఎన్నిక‌ల్లో మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ త‌ర‌పున మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ని కేసీఆర్ తెలిపారు. ముఖ్యుల‌తో చ‌ర్చించి అభ్య‌ర్థిని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాన‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. కాగా, క‌రీంన‌గ‌ర్ ఎంపీ అభ్య‌ర్థిగా వినోద్ కుమార్, పెద్ద‌ప‌ల్లి అభ్య‌ర్థిగా కొప్పుల ఈశ్వ‌ర్, ఖ‌మ్మం అభ్య‌ర్థిగా నామా నాగేశ్వ‌ర్ రావు, మ‌హబూబాబాద్ అభ్య‌ర్థిగా మాలోత్ క‌విత పేర్ల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement