Monday, April 29, 2024

TS: నీట్ లో మెరిసిన మాగనూర్ ఆణిముత్యం..

మాగనూర్(ప్రభ న్యూస్) : మాగనూర్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని ఈడిగి మాధురి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నీటి పరీక్షల్లో తన ప్రతిభను చుపించింది. మాగనూర్ మండల కేంద్రనికి చెందిన ఈడిగి అనుజా రాజు గౌడ్, దంపతుల కుమార్తె ఈడిగి మాధురి చిన్నతనం నుండి చదువు పట్ల ఎంతో ఆసక్తి ఉంది. తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం శ్రద్ధగా చదువుకొని సోమవారం వెలువడిన నీట్ పరీక్ష ఫలితాల్లో 720 మార్కులకుగాను 558 మార్కులతో విజ‌యం సాదంచింది. విద్యార్థిని మాధురి. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపించడం తో పలువురు అభినందిస్తున్నారు.

విద్యార్థిని ప్రతిభ కనపరిచడంపై ఎంపీపీ శ్యామల చెన్నప్ప, సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ సుధ ఆంజనేయులు, మాజీ జెడ్పిటిసి సరితా మధుసూదను రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు నరసింహ రెడ్డి, టిఆర్ఎస్ యూత్ ప్రసిడెంట్ పల్లె మరెప్ప, విద్య సంఘాల నాయకులు విద్యార్థిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement