Sunday, April 28, 2024

TS – క్రిష్ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా…

హైదరాబాద్‌: రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి సినీ దర్శకుడు క్రిష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇందులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాడిసన్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని గచ్చిబౌలి పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement