Wednesday, May 1, 2024

AP – కృష్ణప‌ట్నం పోర్ట్ లో గ్యాస్ లీక్ … ఇద్ద‌రు కార్మికులు మృతి…

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టులో జరిగిన ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం అదానీ కృష్ణపట్నం పోర్టుకు ఇండోనేషియా నుంచి ఓ నౌక బొగ్గు లోడ్‌తో వచ్చింది. నౌకలోని ట్యాంకర్‌ను క్యాజువల్ ఉద్యోగులు క్లీన్ చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది. ఈ దుర్ఘటనలో క్యాజువల్ ఉద్యోగులు ఖదీర్‌, ప్రశాంత్‌లు మృతి చెందగా మరికొందరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. లీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement