Monday, April 29, 2024

TS | వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం.. న‌లుగురు అరెస్ట్

మెట్ పల్లి, (ప్రభ న్యూస్ ) : మెట్ పల్లీ పట్టణంలో లైసెన్సులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారలు చేస్తున్న వారిపై జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ కొరడా జలిపించారు. ఎస్పీ ఆదేశాల మేరకు… పట్టణంలో గల కట్కం ప్రకాష్, అతని ఇద్దరు కుమారులు శివ, కార్తీక్ లు, తమ్ముడు రమేష్ లు ఎలాంటి అనుమతిలు లైసెన్సు లేకుండా పాన్ బ్రోకర్స్ పేరుతో ప్రజల వద్ద నుండి బంగారం తాకట్టు పెట్టుకొని అధిక వడ్డీలకు వ్యాపారం చేస్తున్నారనే సమాచారంతో కట్కం ప్రకాష్ ఇంటిలో దాడులు చేశారు.

ఈ త‌నీఖీల్లో సుమారు 90లక్షల విలువ గల 1.50కీలలో తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని…. 7లక్షల నగదు, 13 రిస్పిట్ బుక్ లను సీజ్ చేసినట్లు తెలిపారు. దీని మొత్తం విలువ 97లక్షలు ఉంటుందని ఎస్ఐ చిరంజీవి తెలిపారు. కట్కం బ్రదర్స్ పేరుతో ఫైనాన్స్ నడిపిస్తున్న కట్కం ప్రకాష్, రమేష్, శివ, కార్తీక్ ఈ నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement