Tuesday, April 30, 2024

AP | కరుణించిన దుర్గమ్మ.. నవ దంపతులకే ఆ చాన్స్

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. దుర్గమ్మను దర్శించుకునేందుకు ఎక్కడినుంచో భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఇంద్రకీలాద్రి కిటకిటలాడిపోతుంది. ఈ సంద‌ర్భంగా దుర్గామల్లేశ్వరిస్వామి వార్ల దేవస్థానం బోర్డు అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. మే నెల ప్రారంభం నుంచి నూతన వధూవరులకు అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం, లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు.

అయితే సౌభాగ్యమస్తు పథకం కింద కొత్తగా పెళ్లైనవారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సదుపాయాన్ని పొందేందుకు కొత్తగా పెళ్లైన దంపతులు మాత్రమే అర్హులు. వివాహ దుస్తుల్లోనే ఆలయాన్ని సందర్శించాలి. కొత్త జంటతో పాటు వారి కుటుంబసభ్యులకు ఉచితంగా వీఐపీ దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement