Sunday, April 28, 2024

TS – సింగ‌రేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో 10.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందించడం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్లాంట్ ను ఉప ముఖ్యమంత్రి, ఇంధన, ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు , పినపాక నియోజకవర్గం శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యుడు కోరం కనకయ్య, అశ్వరావుపేట నియోజవర్గ శాసనసభ్యుడు జారే ఆదినారాయణ , సత్తుపల్లి శాసనసభ్యుడు మట్ట రాగమయి, వైరా శాసనసభ్యుడు రాములు నాయక్ , సింగరేణి సీ ఎండి బలరాం,రు ఐ ఎన్ టి యు సి నాయకుడు జనక్ ప్రసాద్, ఏఐటియుసి నాయకుడు సీతారామయ్య , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సింగరేణి ఐఎన్టీయూసీ ,, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement