Tuesday, April 30, 2024

TS: టైమ్ ఫిక్స్ చేశా.. వచ్చేయ్ ప్ర‌మాణం చేద్దాం.. హ‌రీష్ రావు

రేవంత్ స‌వాల్ కు హ‌రీష్ రెస్పాండ్
గ‌న్ పార్క్ కు ర‌మ్మంటూ ఆహ్వానం
ఇద్ద‌రం రాజీనామా లేఖ‌ల‌ను మేథావుల‌కిద్దాం
బిఆర్ఎస్ ఎంపి అభ్య‌ర్ధి వెంక‌ట్రామిరెడ్డి నామినేష‌న్
ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు..

మెద‌క్ – సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు మరో సవాల్ విసిరారు. రేపు ఉదయం 10గంటలకు గన్ పార్క్ దగ్గరకు వస్తా అన్నారు. ఆగస్ట్ 15 లోగా రుణమాఫీ చేసేది నిజమైతే.. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. మనమిద్దరం మన రాజీనామా లేఖలని మేధావులకి ఇద్దామన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తే నా రాజీనామా లేఖని స్పీకర్ కి ఇస్తా అన్నారు. నువ్వు చెయ్యకపోతే నీ రాజీనామా లేఖని గవర్నర్ కి ఇస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి నువ్వు సిద్ధమా..నీకు దమ్ముంటే రా..! అని మరో సవాల్ విసిరారు. కొడంగల్ లో తోక ముడిచినట్టే తోక ముడుస్తావా అన్నారు.

మెద‌క్ బిఆర్ ఎస్ అభ్య‌ర్థి వెంక‌ట్రామిరెడ్డి నేడు నామినేష‌న్ దాఖ‌లు చేశారు.. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు మాట్లాడుతూ…. సిద్దిపేట బీజేపీ మీటింగ్ లో టెంట్ లు వేసి, కూలర్లు వేసి, వాటర్ బాటిళ్లు ఇచ్చి మీటింగ్ పెట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మెదక్ లో మీటింగ్ పెడితే ఎండ కూడా భయపడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి కేసీఆర్ ఏం చేశార‌ని మాట్లాడుతున్నారని అన్నారు. ఏం చేసిండు బిడ్డా లిల్లిపుట్… నువ్వు మెదక్ వచ్చావు అంటే అది కేసీఆర్ వల్లనే అన్నారు. కేసీఆర్ మెదక్ ని జిల్లా చేస్తేనే నువ్ మెదక్ వచ్చావు… లేకపోతే సంగారెడ్డిలో నామినేషన్ వేసేవాడివి అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి స్క్రిప్ట్ రైటర్ సరిగా లేడ‌ని,.. సరిగా రాసిస్తలేరన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇజ్జత్ మానం తీసుకుంటున్నాడని తెలిపారు. నీ పరువు పోతే పోయింది.. కానీ సీఎం పదవి విలువ తగ్గిస్తున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

బాండ్ పేపర్ కి వాల్యూ ఉండేద‌ని, .. కాంగ్రెస్ వాళ్లు బాండ్ పేపర్ ఇచ్చిన తర్వాత దాని వాల్యూ కూడా పోయిందన్నారు హ‌రీష్. ఇప్పుడు ఎక్కడపోతే అక్కడ దేవుళ్ళకు దండం పెడుతున్నారని తెలిపారు. నా ఎత్తు గురించి మాట్లాడే ధ్యాస వ‌దిలి రైతుల వడ్లు అమ్ముడుపోతలేవు అది చూడు అంటూ రేవంత్ కు సూచించారు.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట నమ్మితే నీళ్లు లేని బావిలో దూకినట్టే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో ఏదేదో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది.. కానీ పేదల గురించి పట్టించుకోదన్నారు. బీఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు మలుపు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement