Sunday, May 19, 2024

TS | కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు… నూరు అబద్ధాలతో సమానం : హరీశ్ రావు

కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలలో పోటీ పడుతున్నారని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వివిధ సందర్భాలలో మాట్లాడిన వీడియోలను ట్వీట్ చేశారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు ఉంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ, అయిపోయాక మొండి చేయి చూపిస్తున్నదని మండిప‌డ్డారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెబుతారని హెచ్చ‌రించారు.

అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు పోటీ పడుతున్నార‌ని. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో ప్రకటించి అభాసుపాలైన భట్టి.. తాజాగా రుణమాఫీపై కూడా నాలుక మడత బెట్టారు. వంద రోజుల్లో రుణ మాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని భట్టి చెప్పడం 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచించడమే అని పేర్కొన్నారు. డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో చెప్పడమే గాక, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం రుణమాఫీ పైనే అని చెప్పిన విషయం భట్టికి తెలియనట్టు నటించడం హాస్యాస్పదం అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement