Wednesday, May 1, 2024

TS: కట్ట మైసమ్మ ఆలయంలో ఈటల నామినేషన్ పత్రాలకు పూజలు

బీజేపీ మల్కాజ్‌గిరి లోక్ సభ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలను ఆయన సతీమణి ఈటల జమున ప్రత్యేక పూజలు చేయించారు. గురువారం శామీర్ పేట్ కట్ట మైసమ్మ ఆలయంలో అమ్మవారి దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల జమున మాట్లాడుతూ.. మల్కాజ్‌గిరి లో రాజేందర్ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని అకాంక్షించారు.

ఎన్నికల ప్రచారంలో అన్నివర్గాల ప్రజలు అదరిస్తున్నారని తెలిపారు. మల్కాజ్‌గిరి సమగ్రాభివృద్ది కోసం బీజేపీకి ఓటేయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట స్థానిక నాయకులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement