Wednesday, May 8, 2024

సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

క‌రోనా బారిన ప‌డిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని రాష్ర్ట వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సిద్దిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయంలో  తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వర్గల్  సరస్వతి అమ్మవారి సన్నిధిలో వేదపండితులు ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరగా కోలుకోవాలని వేద పట్నం చేశారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ బాగుండాలని, కరోనా నుండి తొందరగా కోలుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతి చంద్రశేఖర శర్మ, ఎంపీపీ లతా రమేష్, జడ్పిటిసి బాలు యాదవ్, పిఎసిఎస్ చైర్మన్  రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు,బలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement