Sunday, May 5, 2024

గుమ్మడిదలలో ప్రారంభ‌మైన‌ టిఆర్ఎస్ రైతు ధర్నా


గుమ్మడిదలలో టిఆర్ఎస్ నిర్వహించనున్న రైతు ధర్నా కార్యక్రమం ప్రారంభ‌మైంది. వచ్చే యాసంగికి సంబంధించి రైతులు పండించే వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలని టిఆర్ఎస్ డిమాండ్ చేస్తూ నియోజవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని గుమ్మడిదలలో ఏర్పాటు చేసింది. ధర్నా కోసం టిఆర్ఎస్ నేతలు సర్వం సిద్ధం చేశారు. భారీ ఎత్తున టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ గ్రామాల రైతులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement