Saturday, May 4, 2024

Tributes – దేశ అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు వాజ్ పేయి..ఎమ్మెల్యే దన్ పాల్

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)25: జీవితాంతం భారత రత్నా, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి దేశాభివృద్ధికి కృషి చేసిన మహనీయుడని అర్బన్ శాసన సభ్యులు దన్ పాల్ సూర్య నారాయణ కొనియా డారు. సోమవారం నిజామా బాదు నగరంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాల యంలో మాజీ ప్రధాని అటల్ బిహారి మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి చిత్రపటానికి అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు బస్వా లక్ష్మి నరస య్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి పేదల కోసం తపిస్తుండే వారని గుర్తు చేశారు.అణగారిన వర్గాల అభ్యున్నతే అయన లక్ష్యంగా కృషి చేశారని తెలిపారు. నరేంద్ర మోడీప్రభుత్వం 2014లో వాజ్‌పేయి పుట్టిన రోజును డిసెంబర్ 25ని సుపరి పాలన దినంగా గుర్తించాలని ప్రకటించిందన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా పార్టీ అధ్యక్షులు బస్వా లక్ష్మి నరసయ్య మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మి నారాయణ, రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతనకర్ లక్ష్మి నారాయణ, న్యాలం రాజు ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, దళిత మోర్చా అధ్యక్షులు B R శివప్రసాద్, యువ మోర్చా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి,బుస్స పూర్ శంకర్, కోడూరు నాగరాజు, దుద్దుల గిరిబాబు,బొట్టు వెంకటేష్,లక్ష్మణ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement