Sunday, April 28, 2024

Inspection: ప్రైవేటు బ‌స్సుల‌పై ర‌వాణా శాఖ దాడులు.. 15బ‌స్సులపై కేసులు న‌మోదు

ప్రైవేటు బ‌స్సుల‌పై ర‌వాణ శాఖ అధికారులు దాడులు నిర్వ‌హించారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా అధికారుల ఆదేశాల మేర‌కు ఎల్బీన‌గ‌ర్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సుల‌ను త‌నిఖీ చేశారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా రోడ్డ‌ల‌పై తిరుగుతున్న 15బ‌స్సుల‌పై కేసు న‌మోదు చేశారు. నిబంధ‌న‌ల‌ను పాటించ‌కుండా ప్రైవేటు టావెల్స్ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని, క‌నీసం ఫైర్ సెఫ్టీని కూడా పెట్టుకోవ‌డం లేద‌ని రవాణా శాఖ అధికారి ఆనంద్ శ్యాంప్రసాద్ తెలిపారు. నిబంధ‌న‌ల‌ను పాటించ‌క‌పోతే చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement