Friday, May 17, 2024

Breaking | క‌రీంన‌గ‌ర్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 10 మంది ఎస్ఐల బదిలీ

కరీంనగర్ (ప్రభ న్యూస్): క‌రీంన‌గ‌ర్‌ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పదిమంది సబ్ ఇన్స్పెక్టర్ లను బదిలీ చేస్తూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ వీఆర్ లో ఉన్న లక్ష్మారెడ్డిని కేశవపట్నంకు, ఇల్లందకుంటలో పనిచేస్తున్న చంద్రశేఖర్ ను కొత్తపల్లికి, వి ఆర్ లో ఉన్న రవి ని కరీంనగర్ వన్ టౌన్ ఎస్ఐ2 గా, కరీంనగర్ సిసిఎస్ లో పనిచేస్తున్న రాజును కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ 1 గా బ‌దిలీ చేశారు.

హుజురాబాద్ లో పని చేస్తున్న రాజన్నను కరీంనగర్ విఆర్ కు, వి ఆర్ లో ఉన్న స్వామిని కరీంనగర్ వన్ టౌన్ ఎస్ఐ 1 గా, వి ఆర్ లో ఉన్న సురేందర్ ను కరీంనగర్ వన్ టౌన్ కు, వి ఆర్ లో ఉన్న మధుకర్ ను హుజురాబాద్ కు, వీఆర్లో ఉన్న లింగన్నను సి పి టి సి కి, ఎస్ బి లో పనిచేస్తున్న రాజ్ కుమార్ ను ఇల్లందకుంటకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement