Sunday, April 28, 2024

Narsinghi: నార్సింగిలో విషాదం…చిన్నారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

నార్సింగిలో విషాదం నెల‌కొంది. అల్కాపూరీ కాల‌నీ మ‌ద‌ర్సాలో చిన్నారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. చిన్న వివాదంలో 12 ఏళ్ల బాలుడిపై తోటి విద్యార్థులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో ర‌కీమ్ తీవ్రంగా గాయ‌ప‌డి అక్క‌డిక్క‌డే కుప్ప‌కూలాడు. భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. బీహార్ కు చెందిన 12 మంది విద్యార్ధులు బాలుడి పై దాడికి పాల్ప‌డ్డారు. రాత్రి చిన్న విషయానికి చిన్నారుల మద్య వివాదం జ‌రిగింది. దీనిపై నార్సింగి పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement