Thursday, May 2, 2024

పార్టీ కోసం సైనికుల్లా కలిసి పని చేద్దాం – అధికారంలోకి తీసుకొద్దాం .. ఎండ‌ల‌

నిజామాబాద్ సిటీ, జూలై ( ప్రభ న్యూస్) 17: పార్టీ కోసం సైనికుల్లా కలిసి పని చేద్దామని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనా రాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్ పాల్ సూర్యనా రాయణ పిలుపు నిచ్చారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని అర్బన్ నియోజ కవర్గం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో టిఫిన్ బైటక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారిరువురు హాజరై మాట్లాడుతూ, ప్రతి ఒక్క కార్యకర్త పాతా కొత్త అనే భేదం లేకుండా కలిసికట్టుగా పని చేద్దామన్నారు.మోడ‌ నాయ కత్వాన్ని బలపరిచి కేంద్ర ప్రభు త్వం చేపడుతున్న అనేక సంక్షే మ కార్యక్రమాలను బూత్ స్థాయి వరకు తీసుకెళ్లాలని వారు సూచించారు. రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ వే అని అన్నారు.

సిఆర్ చేస్తున్న అవినీతి ఆరోపణలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఖండించా లన్నరూ.భారతీయ జనతా పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవని వారు తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరూ పార్టీ జెండా కోసం పని చేస్తున్నామని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద నిధులు మంజూరు చేసిన ఇప్పటికి డబుల్ బెడ్ రూములు పూర్తి కాలేదు అన్నారు. నగర పరిస్థి తుల మీద త్వరలోనే పెద్ద ఎత్తున పోరాటాల కు సిద్ధమ వుతామన్నారు.

ఈ కార్యక్రమం లో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి వినోద్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, అసెంబ్లీ కన్వీనర్ పంచా రెడ్డి లింగం ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు గడ్డం రాజు పుట్టా వీరేందర్ సుక్కా మధు కార్పొరేటర్లు పంచారెడ్డి లావణ్య, ఇల్లందుల మమతా ప్రభాకర్, మాస్టర్ శంకర్, పంచారెడ్డి శ్రీధర్ ,బిజెపి నాయకులు కౌడపు భరత్ భూషణ్ ,నారాయణ యాదవ్ స్వామి యాదవ్ ,బద్దంకిషన్ బిఆర్ శివప్రసాద్ కోడూరు నాగరాజ్ ,రాంప్రసాద్ టెంట్ హౌస్ శ్రీనివాస్ గంగోనె గంగాధర్, దుద్దుల్ల గిరిబాబు సంజయ్, పురోహిత్ మట్టం పవన్ భట్టికారి, ఆనంద్ శివ నూరి భాస్కర్ రామ్మోహన్ శ్రీనివాస్,బిజెపి సీనియర్ నాయకులు బూత్ స్థాయి సభ్యులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement