Thursday, May 2, 2024

కేసీఆర్ హిట్లర్‌లా మారారు: కోదండరాం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను హిట్లర్‌‌తో పోల్చారు. హిట్లర్ పుస్తకాలు చదివి కేసీఆర్ కూడా నియంతలా మారారని వ్యాఖ్యానించారు. విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(డీటీఎఫ్‌) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందంటూ సీఎం కేసీఆర్‌ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని, స్వచ్ఛ కార్మికులను నియమించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement