Monday, April 29, 2024

ఒత్తిళ్లు అధిగమించాలంటే క్రీడలకు టైమ్‌ కేటాయించాలి: సీపీ తరుణ్ జోషి

విధి నిర్వహణలో భాగంగా పోలీసులకు ఎదురయ్యే పనిఒత్తిళ్ల‌ను అధిగమించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది క్రీడలకు కొద్ది సేపు సమయాన్ని కేటాయించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లోనూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్టును ఇవ్వాల (శనివారం) ఆయ‌న‌ ప్రారంభించారు. అధికారులు, సిబ్బంది మానసికోల్లాసాన్ని కలిగించడంతో పాటు పని ఒత్తిడిని అధిగమించ‌డానికి ఈ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్టు ఏర్పాటు చేశారు. కార్యక్రమములో అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, పుష్పారెడ్డి, భీంరావు, సంజీవ్, ఏసిపి నాగయ్య, ఆర్.ఐ నగేష్, భాస్కర్, సతీష్, మాజీ శాప్ డైరక్టర్ రాజనాల శ్రీహరితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement