Friday, April 26, 2024

అమ్మో పెద్దపులి: చెట్టెక్కిన పశువుల కాపర్లు

కొమురం భీం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. బెజ్జూరు మండలం గబ్బాయి అటవీ ప్రాంతంలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. పులి దాడిలో ఇప్పటికే ఒక ఆవు మృతి చెందగా.. మరో రెండు ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. పులిని చూసిన పశువుల కాపర్లు చెట్టెక్కి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. పెద్దపులి సంచారానికి సంబంధించి స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పులికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. పులి పాద ముద్రల ఆధారంగా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పులి సంచరిస్తుండటంతో గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement