Sunday, May 5, 2024

Ticket fight in congress – మ‌ల్యాజిగిరి టిక్కెట్ నాదే అంటున్న శ్రీధ‌ర్… పాత‌వారికి ప్రాధాన్య‌త ఉంటుద‌న్న మ‌ధుయాష్కి

అల్వాల్, సెప్టెంబర్ 25(ప్రభన్యూస్): అధికార పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించినప్పటికి కాంగ్రెస్ పార్టీ కి కట్టుబడి ఉన్న నాయకులను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించేది లేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పష్టం చేశారు.. పాతవారిని పక్కనపెట్టి కొత్తవారికి సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ ఆనవాయితీ కాదన్నారు.. మేడ్చల్ మల్కాజిగిరి డిసిసి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ తో సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ లు సమావేశం అయ్యారు..కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులను పార్టీని నమ్ముకుని ఉన్న వారినీ సరైన ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు.. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ల సీట్ల కేటాయింపు జరగలేదన్నారు.. మైనంపల్లికి టికెట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారం సరికాదని,కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు..

మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ మాట్లాడుతూఇప్పటివరకు మల్కాజిగిరి సీటుకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేదన్నారు.. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి పోటీ చేయడం ఖాయమని అన్నారు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, విహెచ్ హనుమంతరావు చర్చలు జరిపారని తెలిపారు..మల్కాజ్గిరి నుండి మైనంపల్లికి టికెట్ కేటాయించే అంశంపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీని నమ్ముకుని కష్టపడుతున్న వారికి న్యాయం జరుగుతుందని అన్నారు.. కుటుంబానికి ఒకటే టికెట్ అనే ఉదయపూర్ డిక్లరేషన్ ఇక్కడ కూడా వర్తిస్తుందని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement