Friday, May 3, 2024

తెలంగాణలో కొత్తగా 44 వేల పరీక్షలు 3,816 కేసులు

తెలంగాణలో ఆదివారం కొత్తగా 3,816 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,28,823కు చేరింది. మహమ్మారితో చికిత్స పొందుతూ మరో 27 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఆదివారం 44,985 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 658 కరోనా కేసులు నమోదవగా.. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 239, రంగారెడ్డిలో 326, ఖమ్మంలో 151 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. తాజాగా కరోనా నుంచి 5,892(మొత్తం 4,74,899) మంది కోలుకున్నారు. మరో 50,969 మంది చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement