Thursday, May 2, 2024

Breaking | ఆటోను ఢీకొట్టిన బొలెరో వాహనం.. ముగ్గురి దుర్మరణం

జోగులాంబ గద్వాల (ప్రతినిధి), (ప్రభ న్యూస్): జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. గద్వాల మండలం, గోనుపాడు గ్రామ సమీపంలోని పార్చర్ల మిట్ట దగ్గర ఇవ్వాల వారుజామున ఆటోను, బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందినవారు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో అర్జున్ 22, వైశాలి 18, జమ్ములు 45గా గుర్తించారు.

ముగ్గురు ఒకటే కుటుంబ సభ్యులు మృతదేహాలను గద్వాల ఆసుపత్రికి తరలించారు. గద్వాల పురపాలక సంఘం పరిధిలోని ఏడవ వార్డు దౌదర్పల్లి కి చెందిన అర్జున్, వైశాలి, జమ్ములు వీరు ముగ్గురు తల్లి కొడుకు కోడలు ప్రతిరోజు జీవనం సాగించేందుకు ఆటోలో కర్ణాటక రాష్ట్రం, రైచూర్ కి వెళ్లి పాత బట్టల వ్యాపారం చేస్తున్నారని సమాచారం.

అయితే ఎప్పటి మాదిరిగానే ఈరోజు ఉదయం కూడా తెల్లవారుజామున బయలుదేరి రాయచూర్ కి వెళుతున్న సందర్భంలో గద్వాల మండలము గోనుపాడు గ్రామ సమీపంలోని పార్చర్ల మిట్ట దగ్గర రాయచూరు వైపు నుంచి గద్వాల వైపు వస్తున్న పశువులను తీసుకెళ్తున్న బొలెరో వాహనం అతి వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణం చేస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో ఏడవ వార్డులో, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

- Advertisement -

సంఘటన స్థలానికి ధరూరు పోలీసులు చేరుకొని మృతదేహాలను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తెల్లవారుజామున అతి వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టిన బోలెరో వాహనంలో ఉన్న వారు పశువులను తీసుకొని అక్కడినుంచి పరారైనట్టు సమాచారం. అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టిన బొలెరో వాహనం డ్రైవర్ ముగ్గురు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement