Sunday, April 28, 2024

Theft – వైన్స్ షాపులో దొంగతనం…

భీంగల్ టౌన్, అక్టోబర్ 11 ( ప్రభన్యూస్ ). పట్టణం లోని వెంకటేశ్వరా వైన్స్ లో దొంగతనం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి వైన్స్ లోకి చొరబడిన దొంగలు క్యాష్ కౌంటర్ లో ఉంచిన రూ 40 వేయిల నగదు తో పాటు రూ లక్ష విలువ గల మద్యం బాటిల్లను ఎత్తుకెళ్లారు. ఉదయం దొంగతనం జరిగిన విషయం గమనించిన వైన్స్ యజమాని ప్రభాకర్ పోలీసులకు పిర్యాదు చేశారు. పిర్యాదు తీసుకున్న సీఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. దొంగలను త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement