Monday, April 29, 2024

Theft in Gadwal – పెద్ద‌ల పండుగ‌కు ఊరెళితే…. ఇంటి మొత్తం దోచేశారు..

గద్వాల (ప్రతినిధి) అక్టోబర్ 19 (ప్రభ న్యూస్). జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భారీ దొంగతనం జరిగింది. జిల్లా కేంద్రంలోని సంతోష్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సునీత ఇంట్లో 10 తులాల బంగారం, 14 లక్షల రూపాయలను ఇంట్లో ఎవరు లేని సమయంలో బీరువాను పగలగొట్టి ఎత్తుకెల్లారు దొంగలు. సునీత అనే ఇంటి యజమానురాలు పొలం అమ్మిన డబ్బులు ఇంట్లో పెట్టినట్లు గడిచిన శుక్రవారం రోజు అల్లంపూర్ తాలూకా రామాపురం గ్రామంలో పెద్దల పండుగకు వెళ్ళింది..

ఈరోజు వచ్చి చూస్తే ఇంటికి తాళం ఉందని లోపలికి వెళ్లి చూస్తే బీరువాను పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు నగదును ఎత్తుకెళ్లినట్లు ఆమె తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు ఇంటి తాళాలను పగలగొట్టి వాటి స్థానంలో మరో తాళం వేసి వెళ్లారు. ఇంటికి మరో తాళం ఉండడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమానురాలు బంధువులకు తెలపగా అట్టి తాళాన్ని పగలగొట్టి చూడగా లోపల దొంగతనం జరిగినట్లు గుర్తించారు.. దీనిపై బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.. చోరి చేసిన వాళ్ల‌ను త్వ‌ర‌గా ప‌ట్టుకుని నాకు న్యాయం చేయాల‌ని అభ్య‌ర్ధించింది. సంఘటన స్థలాన్ని పరిశీలించారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement