Friday, April 26, 2024

మార్ట్ యజమాని నిర్లక్షానికి కార్మికుని బలి

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం రోడ్ లో భాగ్యనగర్ ప్రాంతంలోని ఎస్ ఎస్ ఎం మార్ట్ యజమాని నిర్లక్షానికి కార్మికుడు బలయ్యాడు. మార్ట్ లో పనిచేస్తున్న బీహార్ కు చెందిన కార్మికున్ని యజమాని శ్రీశైలం ట్రాన్స్ ఫార్మర్ ను శుభ్రం చేయమని ఆదేశించాడు. సర్ కరెంట్ షాక్ వస్తుందని చెప్పినా.. చేస్తావా చెయ్యవా ఉద్యోగం చేయాలని లేదా అని బెదిరించడంతో బుధవారం మధ్యాన్నం 12 గంటల ప్రాంతంలో శుభ్రం చేస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సెట్ బాక్ లేకుండా, ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించకుండా నిర్మించాడ‌ని, యజమాని నిర్లక్ష్యానికి కార్మికుడు బ‌ల‌య్యాడ‌ని, మార్ట్ యజమానిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement